ముఖ్యమంత్రి రోశయ్య

నేటి రాజకీయాలు .... మన నాయకులు....

Monday, October 4, 2010

టీఆర్‌ఎస్‌ ‘ఆట’కు రోశయ్య చెక్‌ !

rosaiah-chek
టీఆర్‌ఎస్‌ ఆటకు ముఖ్యమంత్రి రోశయ్య చెక్‌ పెట్టారు. తెలంగాణ ప్రజల్లో ఉన్న సాంస్కృతిక భావనను సొమ్ము చేసుకోవడం ద్వారా రాజకీయ లబ్థి పొందాలన్న టీఆర్‌ఎస్‌ వ్యూహాన్ని రోశయ్య వ్యూహాత్మకంగా దెబ్బకొట్టారు. తెలంగాణలో బడుగు బలహీన వర్గాల పండుగయిన బతుకమ్మ ను రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించా లన్న నిర్ణయంతో రాజకీయ లబ్ధి పొందాలన్న టీఆర్‌ఎస్‌ ఎత్తుగడ దారుణంగా దెబ్బతిందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

కోటి బతుకమ్మల జాతర పేరిట కేసీఆర్‌ కూతురు, తెలంగాణ జాగృతి కన్వీనర్‌ కవిత నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ జాగృతి అనేది పేరుకు టీఆర్‌ఎస్‌కు సంబంధం లేకపోయినా, ఆమె కార్యక్రమాలను టీఆర్‌ఎస్‌ కార్యకర్తలే నిర్వహిస్తున్న విష యం బహిరంగమే. ఆమె కార్యక్రమాల వివరాలు కూడా టీఆర్‌ఎస్‌ కార్యాలయం నుంచే వెలువడుతున్న విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యాన నిర్వహించే కోటి బతు కమ్మల జాతర ద్వారా తెలంగాణ ప్రజలకు సాంస్కృతికం గా దగ్గరయేందుకు శరవేగంగా సన్నాహాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వమే బతుకమ్మ పండు గను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడంతో టీఆర్‌ఎస్‌ ఇరకాటంలో పడినట్టయింది. దీనిద్వారా కాంగ్రెస్‌ ప్రభుత్వానికే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయా లపై చిత్తశుద్ధి ఉందన్న సంకేతాలు ఇవ్వాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.పండుగను సర్కారే స్వయంగా నిర్వహించడంతో పాటు.. జిల్లాకు లక్ష రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. 7 నుంచి 15వ తేదీ వరకూ అన్ని జిల్లా కేంద్రాల్లో బతుకమ్మ పండుగను నిర్వహించనుంది. హైదరాబాద్‌ పీపుల్స్‌ప్లాజాలో భాగ్య నగర్‌ బతుకమ్మ ఉత్సవాలను ప్రభుత్వం ప్రారంభిస్తుంది. ఏడు రోజుల ఉత్సవాలను శిల్పారామంలో నిర్వహించనుంది.

ప్రభుత్వం నిర్వహించే బతుకమ్మ పండుగలో మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పార్టీకి చెందిన కార్యకర్తలను ఎక్కువ సంఖ్యలో సమీ కరించనున్నారు. ప్రధానంగా.. మహిళా కార్యకర్తలను భారీగా సమీకరించేం దుకు సన్నాహాలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ను వ్యతిరేకించే ఉద్యమ సంస్థలనూ భాగస్వా ములను చేయనున్నారు. బతుకమ్మ పండుగను కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం నిర్వహి స్తోందన్న సంకేతాలను విస్తృతంగా ప్రచారం చేయడమే రోశయ్య లక్ష్యంగా కనిపిస్తోంది.

తెలంగాణపై కాంగ్రెస్‌ మాట్లాడటం లేదని, తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటోందన్న విమర్శలను దృష్టిలో ఉంచుకున్న ముఖ్యమంత్రి రోశయ్య, కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ప్రజల మనోభావాల మేరకు వ్యవహరిస్తుందన్న సంకేతాలిచ్చేందు కే హటాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో టీఆర్‌ఎస్‌ను మానసికంగా దగ్గరచేసే ఈ సాంస్కృతిక ఎత్తుగడను తిప్పికొట్టినట్టయిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

నిజానికి, రోశయ్య ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఎవరూ ఊహించలేదు. చివరకు కాంగ్రెస్‌ నేతలు కూడా బతుకమ్మ పండుగ విషయంలో సీఎం ఇంత త్వరగా స్పందిస్తారని అంచనా వేయలేదు. ముఖ్యమంత్రి తాజా నిర్ణయం తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు మనో స్థైర్యం ఇచ్చినట్టయింది. ఇప్పటివరకూ తెలంగా ణ అంశంపై ఒక్క టీఆర్‌ఎస్‌ గళమే వినిపిస్తున్నం దున.. డిసెంబర్‌ తర్వాత జరిగే పరిణామాల్లో కాంగ్రెస్‌దే పైచేయి ఉండాలన్న లక్ష్యంతో పాటు, టీఆర్‌ఎస్‌కు చెక్‌ పెట్టేందుకు రోశయ్య ఇప్పటినుంచే వ్యూహరచన ప్రారంభించినట్లు కనిపిస్తోంది.

ఇప్పటికే తెలంగాణపై సర్వ హక్కులూ తమదేనని భావిస్తూ, ఆ మేరకు తెలంగాణపై పట్టుకోసం కృషి చేస్తున్న కేసీఆర్‌, భవిష్యత్తులో కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచడం ఖాయమని గ్రహిం చిన రోశయ్య.. ఇప్పటినుంచే తెలంగాణలో పార్టీని పటిష్టం చేసే వ్యూహంతోనే బతుకమ్మ పండుగను ప్రభుత్వమే అధికారికంగా నిర్వ హించేలా ఉత్తర్వులిచ్చారు.ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తర్వాత తెలంగాణ సహా సీమాంధ్రకు చెందిన సీఎంలుగా ఎంతోమంది వచ్చినప్పటికీ, రోశయ్య ఒక్కరే తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రభుత్వ పరంగా నిర్వహించారన్న కీర్తి సంపాదించారు. తనకు ఏ ప్రాంతం పట్ల ద్వేషం గానీ, ప్రేమ గానీ లేదని, రాష్ట్రం విడిపోయినా తాను హైదరాబాద్‌ లోనే ఉంటానని రోశయ్య అనేకసార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

నిజానికి, బతుకమ్మ పండుగను ప్రభుత్వమే నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ గానీ, ఆ పండుగ పేరుతో హడావిడి చేస్తున్న తెలంగాణ జాగృతి సంస్థ గానీ ఇప్పటిదాకా డిమాండ్‌ చేయకపోవడం గమనార్హం.బతుకమ్మపై రోశయ్య సర్కారుకు అంత ఆసక్తి, శ్రద్ధ ఉండదన్న అంచనాతోనే టీఆర్‌ఎస్‌ వర్గాలు ఆ డిమాండ్‌ జోలికి వెళ్లనట్లు కనిపిస్తోంది. ఙ‚తీరా రోశయ్య నిర్ణయం తీసుకున్న తర్వాత.. ఆత్మరక్షణలో పడిన టీఆర్‌ఎస్‌ బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించాలని, ప్రభుత్వం ప్రకటించిన లక్ష రూపాయల బడ్జెట్‌ ఏమాత్రం సరిపోదని కొత్త రాగం అందుకుంది. వీరి తీరు పరిశీలిస్తే.. బతుకమ్మ ఘనత కాంగ్రెస్‌ ఖాతాలో కలిసిపోతుందన్న ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది.రోశయ్య తీసుకున్న ఈ నిర్ణయంపై తెలంగాణ ఉద్యమ సంఘాలు, ప్రధానంగా మహిళా సంస్థలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

గుర్తించిన తొలి సీఎం రోశయ్యే
Katragadda-Prasanna‘రోశయ్య తీసుకున్న ఈ నిర్ణయం ఒక్క బతుకమ్మ పండుగనే కాదు. తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయా లను గౌరవించినట్టయింది. తెలంగాణేతరుడయినా బతు కమ్మ ప్రాధాన్యాన్ని గుర్తిం చిన తొలి ముఖ్యమంత్రిగా రోశయ్య చిరస్థాయిగా నిలిచిపోతారు. దీన్ని తెలం గాణకు చెందిన ప్రతి ఒక్క సెటిలరూ స్వాగతిస్తార’ని తెలంగాణ సెటిలర్ల ఫోరం కన్వీనర్‌, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నిర్వహించే బతుకమ్మ పండుగలో సెటిలర్లంతా పాల్గొని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో తామూ భాగస్వాములమని చాటి చెబుతామని చెప్పారు. తెలంగాణ గురించి ఉత్తి మాటలు చెప్పే కేసీఆర్‌ లాంటి నాయకులకంటే రోశయ్య ఇచ్చిన ఉత్తర్వు ఒక్కటే ఆయన చిత్తశుద్ధిని స్పష్టం చేస్తోందన్నారు. బతుకమ్మ పండుగ గురించి కవిత నుంచి తెలుసుకునే అవసరం ఎవరికీ పట్టలేదన్నారు.

కవితకు ప్రచార యాన ఎక్కువ
ladyకేసీఆర్‌ కూతురు కవితకు బతుకమ్మ పండుగ కన్నా దాని ద్వారా వచ్చే ప్రచారమే ముఖ్యమని తెలంగాణ డెమోక్రాటిక్‌ ఫ్రంట్‌ అధ్యక్షురాలు నర్రా విజయలక్ష్మి ధ్వజమె త్తారు. ప్రభుత్వ పరంగా బతుకమ్మ నిర్వ హించాలన్న సీఎం రోశయ్య నిర్ణయాన్ని తెలంగాణలోని ప్రతి ఒక్క మహిళ స్వాగ తిస్తుందని స్పష్టం చేశారు. అయితే, ఈ పండుగ నిర్వహణకు నిధులను మరికొంత పెంచాలని సూచిం చారు. తొలిసారిగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి తెలంగాణ ప్రజాసంఘాలు, మహిళల పోరాటమే కారణమన్నారు. ‘ఈ విషయంలో తెలంగాణ జాగృతి నేత, కేసీఆర్‌ కూతురు కవితది ప్రచార ఆర్భాటమే తప్ప, చిత్తశుద్ధి లేదు.

అయినా కవిత వయ సెంత? ఆమె అనుభవం ఎంత? తెలంగాణ మహిళలు కవిత చెప్పే బతుకమ్మ కథలు వినే పరిస్థితిలో లేరు. తెలంగాణ ప్రజలు, కవు లు, కళాకారులు, ఉద్యమ సంఘాలు, విద్యార్థి సంఘాలన్నీ కేసీఆర్‌ కుటుంబానికి దూరమయ్యాయి. బతుకమ్మను జనంలోకి తీసుకు వెళ్లకుండా, ప్రచారం కోసం మీడియా కార్యాలయాల చుట్టూ తిరి గి, పబ్లిసిటీ కోసం పాకులాడుతోందని విమర్శించారు. ప్రభుత్వం నిర్వహించే బతుకమ్మ ఉత్సవాలకు హాజరవుతామన్నారు.

Sunday, August 15, 2010

అంతకంతా వసూల్ ఎమ్మార్‌పై కఠిన వైఖరికే సర్కార్ నిర్ణయం - చర్యలకు వెనకాడొద్దని సీఎం ఆదేశం?

  
26% డెవలప్డ్ ఏరియా కోసం పట్టు
రేటు ప్రాతిపదికపై రెండు ప్రతిపాదనలు
సమీప స్థలం లేదా.. ఎల్ అండ్ టీ ధర
కోర్టుకెళ్లినా ఎదుర్కొనేందుకు సిద్ధం

అక్రమార్కులు తిన్నదంతా కక్కించేందుకు సర్కారు సిద్ధమవుతోంది. ఎమ్మార్ అక్రమాలపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ), ఎమ్మార్-ఎంజీఎఫ్ మధ్య వివాదంలో జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు.. అభివృద్ధి చేసిన భూముల్లో 26 శాతం వాటాను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవాలని తీర్మానించింది.

అంతకు అంతా వసూలు చేయాలని నిర్ణయించుకున్న సర్కారు.... ఇప్పటికే విల్లాలు నిర్మించి అమ్మేసిన వాటికి సంబంధించి.. సమీప స్థలాల్లో ఉన్న రేటు లేదా.. అక్కడికి కొంత దూరంలో ఎల్అండ్‌టీ నిర్మించి, విక్రయించిన విల్లాల రేటు ప్రాతిపదికగా ఎమ్మార్ నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేయాలని గట్టి పట్టుదలతో ఉంది. ఈ మేరకు ప్రభుత్వానికి ఫైల్ పంపాలని కూడా ఏపీఐఐసీని ఆదేశించాలని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించినట్లు సమాచారం.

ఈ విషయంలో తాజా పరిస్థితిని సమీక్షించడానికి అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వం క్రోడీకరిస్తోంది. ఎమ్మార్ విక్రయించిన విల్లాలకు 20శాతమే తెల్లధనం తీసుకున్నారని, మిగిలినదంతా నల్లధనమేనని పలువురు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మార్ రికార్డులను విశ్వసించలేమని స్పష్టం చేస్తున్నారు. కనుక అభివృద్ధి చేసిన భూమిలో 26శాతం వాటా దక్కించుకోవడం, ఇప్పటికే విక్రయాలు జరిగినట్లయితే.. ఎల్అండ్‌టీ రేట్లను ప్రాతిపదికగా చేసుకోవడంపై ప్రభుత్వం స్థిర నిశ్చయంతో ఉంది.

అయితే ఇందుకు ఎమ్మార్-ఎంజీఎఫ్ అంగీకరిస్తుందా? అనేది సందేహమే. ఒప్పందం ప్రకారమే తాము వ్యవహరిస్తున్నామని, ఈ సంస్థ చెబుతున్నది. అధికార ప్రతినిధులు ఎమ్మార్ బోర్డుకు హాజరై తీర్మానాలపై సంతకం చేశారని, వారు ప్రభుత్వానికి చెప్పక పోవడం, అనుమతి తీసుకోకపోవడం తమ తప్పు ఎలా అవుతుందని కూడా ఈ సంస్థ ప్రతినిధులు వాదిస్తున్నారు. అయితే ప్రభుత్వ ప్రతినిధులు ఇద్దరు చేసిన నిర్వాకంతో సంస్థ కోర్టుకు వెళితే దానిని ఎలా ఎదుర్కొనాలనే విషయంలో పాలనా యంత్రాగం పరిశీలన జరుపుతున్నదని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

మరోవైపు.. గతంలో ఏపీఐఐసీకి చైర్మన్‌గా పని చేసి, ఆ ఒప్పందంలో సంతకం చేసిన ప్రస్తుత పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య సమస్యను అతి చిన్నదిగా పేర్కొంటుండటం, ఇందులో సాంకేతిక అంశాలు మాత్రమే ఉన్నాయని పాలనా యంత్రాంగానికి వివరిస్తుండటం చర్చనీయాంశమవుతోంది. ఆచార్య, మీనాలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్‌కు వేర్వేరు నివేదికలు ఇచ్చారని సమాచారం. వీటిని సీఎస్ పరిశీలిస్తున్నారని తెలిసింది.

అయితే.. కొందరికి కొమ్ము కాసే విధంగానే ఆచార్య వాదన ఉందన్న భావనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇందులో భారీ కుంభకోణం ఉందని, సీబీఐ విచారణ జరగాలని కొందరు మంత్రులు చేస్తున్న డిమాండ్‌తో ఏకీభవిస్తోందని తెలుస్తోంది. అన్ని కోణాల నుంచి అధ్యయనం చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడరాదని ముఖ్యమంత్రి రోశయ్య ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.

భారీ స్థాయిలో జరిగిన ఈ కుంభకోణంపై పూర్తిస్థాయి రిపోర్టును తనకు అందించాలని ఇప్పటికే భారీ పరిశ్రమల మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఏపీఐఐసీ ఎమ్‌డీని కోరినా, అది ఇంకా మంత్రికి చేరలేదు. ఏపీఐఐసీలో అంతర్గత కమిటీని నియమించినా.. దానితో పెద్దగా ప్రయోజనం ఉండదని, రిపోర్టు రూపకల్పనకే అది పరిమితమవుతుందని భావిస్తున్నారు.

అయితే మొత్తం వ్యవహారంలో జరిగిన ఒప్పందం ఉల్లంఘన, అతితక్కువ రేటు విక్రయాలతో ఏపీఐఐసీకి టోపీ పెట్టిన విధానం, దీనిని భర్తీ చేసుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులు ఇప్పటికే నిర్ణయానికి వచ్చినా.. న్యాయ సలహాల తర్వాతనే కార్యాచరణ ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ సమస్యపై రాజకీయ దుమారం రేగడంతో పాటు.. అధికార కాంగ్రెస్ ప్రతిష్ఠ కూడా ఇమిడి ఉండటంతో పాలనా యంత్రాంగం తదుపరి చర్యలు కీలకంగా మారనున్నాయి.

సాంకేతిక సమస్య మాత్రమేః ఆచార్య
సాంకేతిక లోపం తప్ప ఈ వ్యవహారంలో పెద్దగా సమస్య లేదని బీపీ ఆచార్య వివరిస్తున్నట్లు తెలిసింది. మంత్రి కన్నాతోపాటు, ఉన్నతాధికారులతో సమావేశమైన సందర్భంలోనూ ఇదే మాటకు ఆచార్య కట్టుబడి ఉన్నారని విశ్వసనీయ సమాచారం. రాజకీయ ప్రమేయంతోనే ఆచార్య పునః నియామకం జరిగిందని, దీంతో వారిని రక్షించేందుకు అయన అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు పెరుగుతున్నాయి.

ఈ హోదాతో ఏపీఐఐసీ డైరెక్టర్‌గా కూడా తిరిగి చేరి, బోర్డులో తన ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి కృషి చేస్తున్నట్లుగా ఇటీవలే జరిగిన సమావేశంలో రూఢీ అయ్యింది. బోర్డు తీర్మానాలు తిరిగి ప్రభుత్వం వద్దకు వచ్చిన సమయంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శిగా తిరిగి వాటిని పరిశీలించి, చర్యలు తీసుకునే అధికారం కూడా ఆచార్యకే ఉంటుంది. దీంతో తిరిగి ఏపీఐఐసీని తన పెత్తనం కిందనే పెట్టుకోవాలనే లక్ష్యంతో రాజకీయ నేతల అండదండలతో ఈ పదవిలో కొనసాగుతున్నారని అధికారవర్గాలు చెబుతున్నాయి.

అప్పటి సీఎం వైఎస్ నియమించిన మంత్రివర్గ ఉప సంఘం అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్య నేతృత్వంలో ఎమ్మార్‌పై సమీక్షించింది. పారిశ్రామిక ప్రగతికి ఆటంకం కలిగించకుండా ఈ సంస్థ విషయంలో పాత ప్రభుత్వ నిర్ణయాలన్నీ కొనసాగించాలని నిర్ణయించింది. అయితే స్వల్ప మార్పులకు సిఫారసు చేశారు. భూమి విలువను పెంచాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గతంలో ఒప్పంద ఉల్లంఘనపై దృష్టిసారించి అవసరమైతే ఒప్పందం రద్దుకు చర్యలు తీసుకునే అవకాశం ఉందని సీనియర్ అధికారి ఒకరు అన్నారు.
ఎమ్మార్‌లో ఎందరో హేమాహేమీలు.. విల్లా సాల్లో మంత్రులు !
boulder_hill రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రతిష్ఠను మింగేసేందుకు అనకొండ మాది రిగా తయారయిన ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ భూ కుంభకోణం వ్యవహారంలో తవ్వినకొద్దీ కొత్త విషయాలు వెలుగుచూస్తు న్నాయి. తిలాపాపం తలాపిడికెడు అన్నట్లు అధికార-ప్రతిపక్షాలు ఈ వ్యవహారంలో అందినకాడికి లబ్ధిపొందినట్లు తెలుస్తోంది. ఈ రకంగా అన్ని పార్టీలనూ ఎమ్మార్‌ సం తృప్తి పరిచి, ఇప్పటివరకూ తన అక్రమాలు బయటపడకుండా విజయవంతంగా వ్యవహరించింది. అయితే, ఆ కంపెనీ అక్రమాలను సర్కారులో ఉన్న పార్టీ పెద్దలే బయటకు తీసుకురావడంతో ఎమ్మార్‌ అక్రమాలు, వాటాల దందాలు క్షేత్రస్థాయిలో చర్చ నీయాంశమయ్యాయి. ఇప్పటి వరకూ వెలుగుచూసిన పేర్లతోనే విస్మయానికి గురవుతున్న ప్రజలు, తాజాగా వెలుగుచూస్తున్న మరికొన్ని పేర్లతో మరింత ఆశ్చర్యానికి గురికాక తప్పదంటున్నారు. ఎమ్మార్‌లో కాంగ్రెస్‌, టీడీపీ, టీఆర్‌ఎస్‌కు చెందిన నాయకులు, మంత్రులు, మాజీ మంత్రులు విల్లాలు, ఫ్లాట్లు తీసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కొందరు వామపక్ష నాయకులకు పార్టీ ఫండ్‌ కింద నిధులు తీసుకున్నట్లు చెబుతున్నారు. వారితోపాటు ఐఏఎస్‌ అధి కారులు కూడా ఉన్నారని చెబుతున్నారు. ప్రస్తు తం వీరిలో 12 మంది వివిధ విభాగాలకు ముఖ్య కార్య దర్శులుగా వ్యవహరిస్తున్నారని, ముఖ్యమంత్రి పేషీలో పనిచేసిన, చేస్తున్న వారికీ ఇక్కడ వాటాలున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలోఅన్ని పార్టీలూ కలసి తమకు అన్యాయం చేశాయని ధ్వజమెత్తుతున్నారు. ఇందులో కొంద రికి ఉచితంగా విల్లాలు, ఫ్లాట్లు కేటాయించగా, మరికొందరికి తక్కువ ధరకు ఇచ్చారంటున్నారు. అయితే, వీరిలో చాలామంది బినామీల పేరుతోనే ఫ్లాట్లు తీసుకున్నారని బాధితులు వివరిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ హయాం నుంచీ మొదలయిన ఎమ్మార్‌ అక్రమాలపై దివంగత కాంగ్రెస్‌ నేత పి.జనార్దన్‌రెడ్డి పోరాడారు. టీడీపీ హయాంలో యువ పారిశ్రామికవేత్తలుగా పేరున్న కోనేరు ప్రసాద్‌ (దుబాయ్‌ ప్రసాద్‌), ఇంకా అప్పటికి రాజకీయ ప్రవేశం చేయని ల్యాంకో రాజగోపాల్‌ సీఎం పేషీలో తిష్ట వేసిన విషయం తెలిసిందే. అప్పటి పలుకుబడితోనే ప్రసాద్‌ విదేశీ సంస్థ అయిన ఎమ్మార్‌ను హైదరాబాద్‌కు రప్పించారు. ఆ తర్వాత ప్రభుత్వం పడిపోయినప్పటికీ వైఎస్‌ సర్కారు కూడా ఎమ్మార్‌కు పట్టం కట్టింది. నాటి ఆర్థిక మంత్రి రోశయ్య ఛైర్మన్‌గా ఉన్న కమిటీ ఇచ్చిన క్లియరెన్సు, సిఫార్సులు ఎమ్మార్‌కు మరింత ఊపిరిపోశాయి. ఎమ్మార్‌ సంస్థ ఎంజిఎఫ్‌ అనే భాగస్వామ్య సంస్థను నిబంధనలకు విరుద్ధంగా ఆహ్వానించడంతో వివాదం మొదలయింది. దానితో కోనేరు ప్రసాద్‌ ఆ సంస్థ నుంచి వైదొలగారు.

కాగా, ప్రస్తుతం క్యాబినెట్‌లో ఉన్న బొత్స సత్యనారాయణ, గీతారెడ్డి, పొన్నాల లక్ష్యయ్య, గల్లా అరుణకూ విల్లాలు, ఫ్లాట్లు ఉన్నాయని బాధితులు చెబుతున్నారు. గతంలో ఏపిఐఐసి ఛైర్మన్‌గా పనిచేసిన అంబటి రాంబాబుకూ బినామీ పేరుతో ఫ్లాటు ఉందంటున్నారు. కాగా, అప్పట్లో వైఎస్‌ సర్కారులో కీలకపాత్ర పోషించి, ఏపిఐఐసిని తన కనుసన్నలలో నడిపించారనే ఆరోపణలున్న కేవీపీ రామచంద్రరావుకు మూడు విల్లాలు బినామీ పేరుతో ఉన్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆయన కుటుంబసభ్యులకూ ఎమ్మార్‌ ఫ్లాట్ల సేవ చేసిందంటున్నారు. అసలు ఆయనే ఏయే పార్టీ నేతలను సంతృప్తి పరచాలన్నదీ సూచించారని బాధితులు పేర్కొంటున్నారు. ఇప్పుడు ఎమ్మార్‌ అక్రమాలు, భూ కేటాయింపుల వ్యవహారం కేవీపీ మెడకు చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సొంత పార్టీ నేతలు సైతం.. ఆయన అందులో కీలకపాత్ర పోషించారన్న కసితోనే కేవీపీని దృష్టిలో ఉంచుకుని ఆరోపణల వర్షం కురిపిస్తున్నారు.

ఇక ఈ వ్యవహారంలో ప్రతిపక్షాలు కూడా తక్కువ తినలేదని బాధితులు చెబుతున్నారు. మాజీ మంత్రులు దేవేందర్‌గౌడ్‌, నాగం జనార్దన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావుకు సైతం ఎమ్మార్‌లో ఫ్లాట్లు, విల్లాలు కొన్ని బినామీలు, మరికొన్ని కుటుంబసభ్యుల పేరుతో ఉన్నాయని బాధితులు చెబుతున్నారు. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి సోదరుడయిన యువరాజ్యం అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు సైతం ఎమ్మార్‌లో విల్లా ఉందని బాధితులు వివరించారు. వీరుకాకుండా.. అసలు ఈ వ్యవహారంలో ఐఏఎస్‌ అధికారులే కీలకపాత్ర పోషించారని బాధితులు మండిపడ్డారు. వారి అత్యుత్సాహం వల్లే తమ భూములు పోయాయని, అప్పట్లో పిజెఆర్‌ తమ పక్షాన పోరాడితే ఒక్కరూ అండగా నిలవలేదని దుయ్యబడుతు న్నారు. భూ సేకరణలో అధికారులతో పాటు స్థానిక రౌడీలు కూడా తమను అప్పట్లో భయపెట్టారని ఆరోపిస్తున్నారు.

Sunday, August 8, 2010

వ్యవసాయ రంగంలో పరిశోధనలు జరగాలి ... ఆహారాభివృద్ధికి శాస్త్రీయ పరిశోధనలు దారిద్య్ర నివారణ సదస్సులో రోశయ్య


karuna and rosaiah


దేశంలో ఆహారాభివృద్ధికి శాస్త్రీయ పరిశోధనలు ఎంతో అవసరమని ముఖ్యమంత్రి రోశయ్య వెల్లడించారు. చెన్నై, నందంబాక్కంలోని ట్రేడ్‌ సెంటర్‌లో శని వారం జరిగిన ఆకలి, దారిద్య్ర నివారణ అంతర్జాతీయ సద స్సులో రోశయ్య అభిప్రాయపడ్డారు. ఈసందర్భంగా  ఎంఎస్‌ స్వామినాధన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ 20వ వార్షికోత్సవ సావనీర్‌ను ఆవిష్కరించారు. రీసెర్చ్‌ ఫౌండేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అజ§్‌ు ఫరిడా స్వాగతోపన్యాసం చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి మూడు రోజుల సదస్సును ప్రారంభించి, వార్షిక నివేదికను విడుదల చేశారు. దీనిని మాల్దీవుల వ్యవసాయ శాఖా మంత్రి ఇబ్రహీం అందుకున్నారు.

ఇందులో గౌరవ అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి రోశయ్య మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో కొత్త సాంకేతిక పద్ధతులను ఉపయోగించడం ద్వారా ఉత్పత్తులను పెంచేందుకు వీలుందన్నారు. ఎంఎస్‌ స్వామి నాధన్‌ దీర్ఘకాలంగా పరిశోధనలు జరిపి వ్యవసాయ అభివృద్ధికి ఎంతో సాయపడుతున్నారని పేర్కొన్నారు.కార్యక్రమంలో వ్యవ సాయ నిపుణులు గేరి, ఉమాలేలే వంటి అనేకమంది ప్రసం గించారు. డాక్టర్‌ఎంఎస్‌ స్వామినాధన్‌ ప్రత్యేకప్రసంగం చేశారు. మంత్రులు ఆర్కాడు వీరాస్వామి, దొరైమురుగన్‌ పాల్గొన్నారు.
తెలుగు భాషాభివృద్ధికి కృషి: తమిళనాట తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తామని ముఖ్యమంత్రి రోశయ్య చెన్నై సవేరా హోటల్‌లో విలేకరుల సమావేశంలో తెలిపారు.



karunaవ్యవసాయ రంగంలో మరింత లోతైన పరి శోధనలు జరగాలని ఆంధ్రప్రదేశ్‌ సీఎం కొణిజేటి రోశయ్య అభిప్రా యపడ్డారు. చెనై్న నందంబాక్కంలోని చెనై్న ట్రేడ్‌ సెంటర్‌లో ఎంఎస్‌. స్వామి నాథన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ‘ఆకలి- పేదరికాన్ని తొలగించడం’ అంశంపై మూడు రోజుల పాటు అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు తొలిరోజు సీఎం రోశయ్య, తమిళనాడు సీఎం కరుణానిధి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడు తూ ఆంధ్రరాష్ట్రంలో వ్యవసాయ రంగం గడిచిన ఐదేళ్లలో ఎంతో ప్రగతిని సాధించిందన్నారు. గత యాభై సంవత్సరాలతో పోల్చితే ఈ ఐదు సంవత్స రాల కాలంలో ఆహార ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయన్నారు.

ఇందుకు తమ ప్రభుత్వం పలు చర్యలను చేపట్టిందన్నారు. వ్యవసాయరంగానికి బ్యాంకుల ద్వారా అధికమొత్తంలో రుణాలను అందచేశామన్నారు. అలాగే ప్రాజెక్టులను కట్టించి నీటి సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. ప్రపంచ వ్యాప్తం గా పెరుగుతున్న జనాభా కూడా ఆహార ఉత్పత్తులు కొరతకు కారణమ న్నారు. దేశ భూభాగంలో 2.3శాతం మాత్రమే వ్యవసాయ యోగ్యమైన భూమికాగా జనాభా మాత్రం 17.5 శాతం పెరుగుతూ ఉందన్నారు. వ్యవ సాయ రంగంలో మరింత పరిశోధనలు జరగాలని ఆయన కోరారు. వ్యవ సాయ రంగంలో ఎంతో పరిశోధనలు చేస్తున్న ప్రొఫెసర్‌ స్వామినాథన్‌ ఈరోజు 85వ పుట్టిన రోజు జరుపుకోవడం అభినందనీయమన్నారు.

ఆయన మరింత కాలం తన పరిశోధనల ద్వారా దేశంలో వ్యవసాయరంగం మరింత అభివృద్ధ్దిలోకి తెచ్చేందుకు కృషిచేయాలని రోశయ్య కోరారు. ఈ కార్యక్రమంలో కరుణానిధి మాట్లాడుతూ రైతులకు, వ్యవసాయరంగానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. వ్యవసాయానికి సంబం ధించి చర్యలు చేపట్టడంలోతమ ప్రభుత్వం ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ కారీ ఫోల్‌వర్‌, సిబిల్లీ సూటర్‌, డాక్టర్‌ ఉమా లీలె, డా. అజయ్‌ పరిడా, డా. సౌమ్య స్వామినాథన్‌ తదితరులు పాల్గొన్నారు.

మచ్చలేని మనిషి రోశయ్య జిందాబాద్‌

roshaiahఅదృష్టం ఉంటేనే పదవులు వస్తాయన్నది కొంతమంది నమ్మకం. అందరినీ కలుపుకుని పోయే మనస్తత్వం, మృదు స్వభావిగా ఉంటే ఎప్పటికైనా ఆ అదృష్టం, మంచి రోజులు వస్తాయని వారి విశ్వాసం. ఇక్కడ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పరిస్థితి వేరు. ముఖ్యమంత్రి పదవిని ఆయన ఆశించకపోయినా విధిలేని పరిస్థితుల్లో అధిష్టానం సూచనల మేరకు సీఎంగా బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. బాధాకర పరిస్థితుల్లో విషాదం, బరువెక్కిన హృదయంతో ఆయన ఆ పదవిని చేపట్టారు. కరడుగట్టిన కాంగ్రెస్‌ వాదిగా, అసాధారణ ప్రతిభ కలిగిన రాజకీయ వేత్తగా, అనేకమంది ముఖ్యమంత్రుల తలలో నాలుకలా ఆయన పని చేశారు. ప్రత్యేకించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డితో అన్నా అనిపించుకునేంత చనువు కలిగిన వారు. ముఖ్యమంత్రి రోశయ్య ‘టర్నింగ్‌పాయింట్‌’ సూర్య పాఠకుల కోసం...

వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలమూ రాష్ట్ర ఆ ర్థిక రథచక్రాన్ని అసాధారణమైన రీతిలో నడిపిం చారు. ఒక్క నాడూ ఓవర్‌ డ్రాఫ్ట్‌ తీసుకురాని ఆర్థిక మంత్రిగా మన్ననలు పొందారు. వరుసగా రెండు ప ర్యాయాలు లక్ష కోట్ల రూపాయల బడ్జెట్‌ ప్రవేశపెట్టి రికార్డు సాధించారు. సాదాసీదాగా కనిపించే 77 సం వత్సరాల రోశయ్య అసెంబ్లీలో 15 బడ్జెట్‌లను ప్రవేశ పెట్టి అరుదైన కీర్తిని సైతం సొంతం చేసుకున్నారు. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటానని ఆయన ఎప్పు డూ అనుకోలేదు. అయాచితంగా అత్యున్నత పీఠంపై కూర్చున్నా, అధిష్ఠానం ఆదేశాలను ఏనాడూ ధిక్కరిం చబోనని, తాను నిక్కమైన కాంగ్రెస్‌ వాదిననీ ఆ యన ఎప్పుడూ చెబుతారు.

రోశయ్య పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రారంభ సమయం లో కొంతకాలం పాటు ధిక్కార స్వరాలు గట్టి గానే వినిపించాయి. చివరకు అన్నీ సద్దుమ ణిగాయి. ముఖ్యమంత్రి స్థానంలో రోశయ్య కుదురు కున్నారు. ఇటీవలే జరిగిన ఎంపీల సమీక్షా సమావే శంలో వైఎస్‌ తనయుడు జగన్‌ వాదనను అడ్డుకుం టూ ప్రస్తుత పరిస్థితిలో తొమ్మిది గంటల విద్యు త్‌ సాధ్యం కానే కాదని తేల్చారు. అలాగే ఓబుళాపురం గనుల అక్రమాలపై సిబిఐ విచారణకు సిఫారసు చేసి సెభాష్‌ అనిపించుకున్నారు. అది జరిగి కొద్ది కాలమై నా కాకముందే సుప్రీంకోర్టు సాధికారిక కమిటీ సూచన మేరకు ఓబుళాపురం సహా ఆరు గనుల్లో త వ్వకాలను ఆపివేయించి ఔరా అనిపించుకున్నారు. ఆరు జిల్లాలు వరదల్లో అతలా కుతలం అయినప్పు డు అత్యంత తక్కువ వ్యవధిలో ప్రధాని మన్మో హన్‌ సింగ్‌, యుపి ఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీని రప్పిం చి సహాయం చేస్తామన్న హామీ ఇప్పించుకున్నారు.

roshaiah-oathవైఎస్‌ అడుగుజాడల్లోనే...
రాష్ట్రప్రజల సంక్షేమం కోసం దివంగత ముఖ్య మం త్రి వైఎస్‌ చేపట్టిన సంక్షేమపధకాలను యధా విధిగా కొనసాగించాలని ప్రయత్నిస్తూనే పాలనపై తనదైన ముద్ర పడేలా అడుగులు వేస్తు న్నారు. క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా అధిష్టానం నిర్ణయాల ప్రకారం ముందుకు వెళుతున్నారు. అన్ని శాఖలపై ఆయనకు ముందు నుంచీ మంచి పట్టుం డడంతో నిత్యం సమీక్షల పేరుతో అధికారులను ప రుగులు తీయిస్తు న్నారు. పదవిని చేపట్టిన తొలి రోజుల్లో కాస్త మెత్తగా ఉన్నా క్రమంగా అధికార యంత్రాం గంలో గుబులు పుట్టిస్తున్నారు.

వైఎస్‌తో విడదీయరాని బంధం...
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డితో రోశయ్యకు ఎంతో అ నుబంధం ఉం ది. వైఎస్‌ రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుంచీ తు దిశ్వాస విడిచే వరకూ ఆయనతో సన్నిహిత ంగా ఉన్నారు. రాజశేఖరరెడ్డి ఎవరితో వి బేధించినా రోశయ్యతో సని్నిహతం గా ఉండేవారు. అన్నా అని స ంబోధిస్తూ ఎంతో ఆప్యా యంగా మెలిగేవారు. సుదీర్ఘ రాజకీయ జీవి తంలో వైఎస్‌ లాంటి ప్రజల మనిషిని, ఆ త్మీయుడిని చూడ లేదని రోశయ్య వినమ్రంగా చెబు తారు.

విద్యార్ధి దశలోనే క్రియాశీల పాత్ర...
తెనాలిలో 1951 - 52లో విద్యార్ధిగా ఉన్న పుడు రోశయ్య రాజ కీయ రంగప్రవేశం చేశా రు. ఎన్‌జి రంగాకు శిష్యు నిగా, గౌతు లచ్చన్నకు ఇష్టు డుగా ఉన్న రోశయ్య అప్పట్లో విద్యార్ధి సమ్మేళన్‌లో క్రియాశీల పాత్రను పోషించారు. తెనాలి దగ్గరలోని వేమూరులో ఓ చిన్న వాణిజ్య కుటుంబం నుంచి వచ్చిన రోశయ్య కొంచెం భిన్నంగా పెరిగారు. తొలి భారత ఎన్నికలలో కాంగ్ర ెస్‌ నుంచి విడిపోయి, కృషికార్‌లోక్‌ పార్టీ పెట్టిన రంగాతో రాజకీయాల్లోకి రోశయ్య అడుగు పెట్టా రు.1954లో గుంటూరు హిందూ కళాశాలలో బీ కాం చదువుతూ అటు కమ్యూనిస్టు, ఇటు కాంగ్రెస్‌ విద్యార్థి సంఘాలతో రోశయ్య పోటీపడ్డారు. హిం దూ కాలేజీ విద్యార్థి సంఘానికి అధ్యక్షునిగా ఎన్ని కయ్యారు.

manmohan-singh-k-rosaiah1955లో ఆంధ్ర ప్రదేశ్‌లో జరిగిన ఎన్ని కలు చరిత్ర మలుపు తిప్పాయి. కమ్యూనిస్టులు అధి కారంలోకి రావచ్చనే వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్‌ కృషికార్‌లోక్‌, ప్రజా సోషలిస్టులు ఐక్య కాం గ్రెస్‌గా ఏర్పడ్డారు. రోశయ్య రాష్టమ్రంతటా పర్యటిం చి ఉపన్యాసకుడిగా రాటుదేలారు. 1959లో స్వతం త్రపార్టీ ఆవిర్భవించినపుడు రోశయ్యకు రాజ గోపా లాచారి, బెజవాడ రామచంద్రా రెడ్డి, ఎం.రత్న స్వా మి, మర్రి చెన్నారెడ్డి, ఎం.ఆర్‌.మసానీ, పీలూ మో డీలతో పరిచయం ఏర్పడింది. తెనాలిలో రైతు నా యకుల కార్యక్రమాలు ఏర్పాటు చేసి రోశయ్య రైతు అభిమానిగా ఎదిగారు. 1962లో తొలి ఎన్నికల తె నాలిలో అపజయం చవి చూసిన రోశయ్య చాలా కా లం ప్రతిపక్షాలలో ఎదురీ దారు. 1967లో మరో సారి ఓటమిపాలైనా వెనుకం జవేయలేదు. రాజకీ యవాదిగానే జీవితాన్ని గడుపుతున్న వ్యక్తిగతంగా అతి సామాన్య శాఖహారిగా ఉన్నారు. 1978లో కాం గ్రెస్‌లో ప్రవేశించిన రోశయ్య పార్టీలో కుదురుకు న్నారు. జలగం వెంగళరావు, టి. అంజయ్య, ఎన్‌. జ నార్ధన్‌రెడ్డి, విజయభాస్కర రెడ్డిలతో సమాన సన్ని హితంగా ఉండగలిగారు.

ప్రత్యేకాంధ్ర ఉద్యమం మరపురానఇనుభవం...
పొట్టి శ్రీరాములు మద్రాసులో నిరాహార దీక్ష చే స్తున్న సమయంలో తెనాలినుంచి కొందరు మిత్రుల తో కలిసి ఆయనను చూడడానికి వెళ్లారు. 13వ రో జున వెళ్ళినపుడు పొట్టి శ్రీరాములు కొద్దిగా కదిలా రు. మళ్లీ 33వ రోజున వెళితే అస్థిపంజరంలా ఉన్నా రు. కానీ నిరాహారదీక్ష మాత్రం మానలేదు. ఆయన ను చూడడం అనేది మరపురాని అనుభవం అని రోశ య్య అంటారు. విద్యార్థి సంఘం నాయ కుడిగా రోశ య్య అప్పట్లో ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో పాల్గొ న్నారు.
roshaiah-wife
పూర్తి పేరు  : కొణిజేటి రోశయ్య
పుట్టినతేది  : జులై 4, 1933
జన్మస్థలం  : వేమూరు, గుంటూరు జిల్లా
విద్యార్హతలు : బి.కాం (హిందూ కాలేజీ, గుంటూరు)
ప్రస్తుత హోదా : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర 22వ ముఖ్యమంత్రి
    (వ్యక్తిపరంగా 16వ ముఖ్యమంత్రి)
భార్య  : శివలక్ష్మి
పిల్లలు  : కె.ఎస్‌.సుబ్బారావు, పి.రమాదేవి,  కె.ఎస్‌.ఎన్‌.మూర్తి

ఇదీ రాజకీయ ప్రస్థానం...
ఎమ్మెల్సీ   - 1968, 74, 80, 2009
ఎమ్మెల్యే   - 1989, 2004
ఎంపీ   - 1998 (నరసారావుపేట నియోజకవర్గం)
ప్రతిపక్షనేత  - శాసనమండలి (1978)
పీసీసీ అధ్యక్షడు - 1995 నుండి 1997

మంత్రిగా...
- తొలిసారిగా 1979లో మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో రవాణా, రోడ్లు భవనాల 
శాఖామంత్రిగా పనిచేశారు.
- టంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో రవాణా, గృహ నిర్మాణ శాఖామంత్రి (1980).
- కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గంలో హోంశాఖామంత్రి (1982)
- మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో ఆర్థికశాఖా మంత్రి (1989)
- నేదురమల్లి జనార్థనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గంలలో ఆరోగ్య, విద్యా, విద్యుత్‌ శాఖా మంత్రి 
- డాక్టర్‌ వై.ఎస్‌. మంత్రివర్గంలో ఆర్థి మంత్రి (2004-09)
- శాసనమండలి నుంచి ముఖ్యమంత్రి పదవిని అధిష్టించిన రెండో వ్యక్తి రోశయ్య.
గతంలో భవనం వెంకట్రామిరెడ్డి ఒక్కరే కౌన్సిల్‌ నుంచి ముఖ్యమంత్రిగా పనిచేశారు.


- ఇస్కా రాజేష్‌బాబు

Friday, August 6, 2010

నాపై కుట్ర : ముఖ్యమంత్రి రోశయ్య

ఎవరూ వేలెత్తిచూపే ఆస్కారం లేకుండా తాను ప్రభుత్వాన్ని నడిపిస్తుంటే కొందరు కుట్ర పన్ని కావాలని అలజడి సృష్టిస్తున్నారని ముఖ్యమంత్రి రోశయ్య నిప్పులు చెరిగారు. ఏవేవో ఆలోచనలు చెప్పి ఆందోళన చేయిస్తున్నారని, దానికి కావాల్సిన సరంజామా ఇచ్చి కథ నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ఫిల్మ్‌నగర్‌ బస్తీ వాసులతో సమావేశం సందర్భంగా రోశయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. తాజా రాజకీయపరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

తనను అస్థిరపరిచేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయన్న భావం రోశయ్య మాటల్లో వ్యక్తమయింది. ముఖ్యమంత్రి నోటి వెంట కుట్ర అనే మాట రావడం పెద్ద విషయంగా రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. అయితే ఆయన తన వ్యాఖ్యలకు సంబంధించి ఎవరి పేరును ఉదహరించలేదు. ఉపకార వేతనాలు, బోధన రుసుముల చెల్లింపు విషయంలో కొందరు చేస్తున్న విమర్శలపై ఆయన కొద్దిరోజులుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనను బీసీ ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నా మంత్రులు సక్రమంగా స్పందించడంలేదని కూడా తప్పుపట్టారు. దాంతో గురువారం బీసీ మంత్రులంతా కలసికట్టుగా విలేకరుల సమావేశం పెట్టి బీసీలకు ప్రభుత్వం ఏం చేస్తోందీ వివరించారు. వై.ఎస్‌ హయాంలోనూ బకాయిలు ఉన్నాయనే వాస్తవాన్ని గణాంకాలతో వారితోనే చెప్పించారు. అదే సమయంలో ఇటు తాను కూడా ప్రత్యక్షంగా విమర్శలకు దిగారు.

క్యాంపు కార్యాలయంలో మాట్లాడేటప్పుడు తొలుత స్థానిక సమస్యలను ప్రస్తావించిన రోశయ్య ఆపై ప్రభుత్వ విధానాలను వివరిస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఫీజులు ఇవ్వట్లేదని, ఉపకారవేతనాలు ఇవ్వట్లేదని అలజడి రేకెత్తించి, ఆందోళనను చేపట్టి, దానికి కావాల్సిన పెట్రోలు, డీజిల్‌, ఆయిల్‌ ఇతర సరంజామా ఇచ్చి కథ నడిపిస్తున్నారని అన్నారు. పేదవారికోసం అంకితభావంతో పనిచేసే ప్రభుత్వం తమదని, తమ నిజాయితీని, పనితీరును అంతా అర్థం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం చేపట్టే ఏ పథకమైనా ప్రజలకు ఉపయోగపడేదిగా ఉండాలన్నారు. పేదల పేరుతో దోపిడీ జరగకుండా, పక్కదారి పట్టకుండా సక్రమంగా అమలు కావాలన్నారు. రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చేయటానికి కావల్సిన సలహాలను, సూచనలను ఏక పక్షంగా తీసుకోవడం లేదని, మంత్రులందరం కలిసి చర్చించుకొని నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. పేద ప్రజలకోసం వైఎస్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రద్దుచేయబోమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇప్పటికే 74 లక్షల మందికి పింఛన్లను ఇస్తున్నామని, వాటిని మరింతగా పెంచేందుకు ఆలోచిస్తున్నామని చెప్పారు. నగరాల్లోని బస్తీవాసుల భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.